నేటి నారా లోకేష్ యువగళం షెడ్యూల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికీ 25 వ రోజుకు చేరింది. గత నెలలో కుప్పం లో ప్రారంభమైన ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ కార్య కర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు లోకేష్.

ప్రస్తుతం లోకేష్ యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 329 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ ఉదయం జీలపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. మధ్యాహ్నం రేణిగుంటలోని వై కన్వెన్షన్ హాల్లో భోజన విరామం ఉంటుంది. ఈ నాటి పాదయాత్రలో ఆయన ఆర్ఎంపీ డాక్టర్లు, ఎస్టీ, యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.

ఉదయం 8 గంటలకు జీలపాలెం (రేణిగుంట మండలం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 గంటలకు గాజులమాండ్యంలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట వై-కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశం.
1.15 గంటలకు రేణిగుంట వై కన్వెన్షన్ హాలు ఆవరణలో భోజన విరామం.
2.15 గంటలకు వై కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
3.30 గంటలకు రేణిగుంట బస్టాండు వద్ద షాప్ కీపర్స్ తో సమావేశం.
సాయంత్రం 6.10 గంటలకు తిరుపతి అంకురా హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంలో బస.