లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న

కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో చికిత్స..ఆసుపత్రికి వెళ్లిన బాలకృష్ణ

nandamuri-tarakaratna-fell-unconscious-in-nara-lokesh-padayatra

కుప్పంః సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం… మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టిడిపి కార్యకర్తల తాకిడి ఎక్కుయింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో తారకరత్నతో పాటు బాలకృష్ణ ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/