తాతగారితో తనను పోల్చవద్దన్న కళ్యాణ్ రామ్

తాతగారితో తనను పోల్చవద్దన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఉగాది సందర్బంగా చెన్నైలోని కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ తెలుగు ఉగాది పురస్కారాలు రాయపేటలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది నటీనటులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటి అవార్డు సమంతను వరించగా, ఉత్తమ నటుడు అవార్డు బింబిసారాకు గాను కళ్యాణ్ రామ్ కు దక్కింది. సమంత ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం తో ఆమె తరుపు బంధువులు అవార్డు ను అందుకున్నారు.

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తాతగారితో తనను పోల్చవద్దన్నారు. తాతగారి స్థాయికి తాను చేరుకోలేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా గాయని పి.సుశీల, నటుడు అలీ, గీత రచయిత చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్..అటు నిర్మాత గా కూడా సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ.. ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.