చైతు జీవితంలో జరిగిన ఆ పెళ్లి దురదృష్టకరమైనది – నాగార్జున

నాగ చైతన్య – సమంతల విడాకుల ఫై నాగార్జున స్పందించారు. చైతు జీవితంలో జరిగిన పెళ్లి దురదృష్టకరమైనది. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేం. ఆ వ్యవహారం ముగిసిపోయింది. మా జీవితాల నుంచి తీసేశాం అంటూ తెలిపాడు నాగార్జున.

ఏమాయచేసావే అంటూ యావత్ యూత్ ను కట్టిపడేసిన జంట నాగ చైతన్య -సమంత. ఈ సినిమా తోనే ఇరువురు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన వీరు తెరపై మాత్రమే కాదు నిజజీవితంలో కూడా ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరి జంట చూసి చాల మంది అసూయపడ్డారు. అంతలా ఇద్దరు ఉండేవారు. సడెన్ గా ఏమైందో ఏమో కొంతకాలానికి విడిపోతున్నట్లు ప్రకటించి..ఇద్దరు విడాకులు తీసుకోని ఎవరికివారయ్యారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు కానీ ఎందుకు తీసుకున్నారనేది ఇప్పటి వరకు తెలియదు. విడాకుల తర్వాత సమంత ను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేసినప్పటికీ అవేమి పట్టించుకోకుండా తన సినిమాలతో బిజీ అయ్యింది.

తాజాగా జాతీయ మీడియా సంస్థ ‘పింక్ విల్లా’ నాగార్జునను చైతు -సమంత ల విడాకులఫై స్పందించాలని కోరింది. అందుకు నాగార్జున స్పందిస్తూ… “నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నాడు. నాకది చాలు. అంతకంటే నేను ఇంకేమీ కోరుకోను. గతంలో అతడి జీవితంలో జరిగిన వ్యవహారం అంటారా…. అదొక అనుభవం. దురదృష్టకరమైనది. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేం. ఆ వ్యవహారం ముగిసిపోయింది. మా జీవితాల నుంచి తీసేశాం. ఇతరులు కూడా దాని గురించి ఇక ఆలోచించరని భావిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.