జన సేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వ‌స్తోంది

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా జ‌న‌సేన శ్ర‌మ‌దానం: వీడియో పోస్ట్ చేసిన‌ నాగ‌బాబు

హైదరాబాద్ : గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌రు 2న జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మాలు చేసిన విష‌యం తెలిసిందే. అనేక‌ ప్రాంతాల్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు రోడ్లను బాగుచేశారు. ఈ నేప‌థ్యంలో రోడ్లు బాగుచేయ‌నివ్వ‌కుండా కొంద‌రు అడ్డంకులు సృష్టించార‌ని జ‌న‌సేన తెలిపింది. దీనిపై సినీన‌టుడు నాగ‌బాబు స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘మన రాష్ట్రంలోని దుస్థితి ఏంటంటే జన సేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని జ‌న‌సైనిక్ మ‌నోహ‌ర్ దేవర శ్రీవిద్యా నికేత‌న్ సంస్థ స‌మీపంలో అర‌కిలోమీట‌రు రోడ్డును బాగు చేయించారు. కొంద‌రు అడ్డుకోవాల‌ని చూసిన‌ప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప‌ని పూర్తి చేశారు’ అని నాగ‌బాబు చెప్పారు. కాగా, రోడ్డు వేసేందుకు కావాల్సిన మెటీరియ‌ల్‌ను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేశార‌ని వీడియోలో జ‌న‌సేన చెప్పింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/