జనసేన కార్యకర్తల కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన నాగబాబు

nagababu gives guidelines to janasainiks

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..జనసేన కార్య కర్తలను, రాష్ట్ర ప్రజలకు బుధువారం ట్విట్టర్ ద్వారా ఓ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘జర బద్రం.. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు.. సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే అని గుర్తెరగండి’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

ఇక ఇప్పుడు మెగా బ్రదర్ , జనసేన పార్టీ నేత నాగబాబు ఇదే విషయమై కార్య కర్తలకు కొన్ని మార్గదర్శకాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో ప్రత్యర్థులు మైండ్‌ గేమ్‌‌కు తెరలు తీసినట్లు కొన్ని సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.
  • జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికో, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికో కొన్ని అనూహ్యమైన ప్రచారాలను ప్రత్యర్థులు వ్యాపింపజేస్తున్నారు.
  • ఈ ప్రచారాలు ఏ ఫలితం ఆశించి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఎవరెవరున్నారు అనే వాస్తవాలను గమనించడం లేదా నిర్ధారించుకోవడం చాలా అవసరం.

*ఉదాహరణకు మీడియా ప్రసార సాధనాలు, సోషల్‌ మీడియాలో మనకు అనుకూలంగానో, లేదా వ్యతిరేకంగానో కొన్ని వార్తలు లేదా ఆర్టికల్స్‌ మనం కోరుకోకుండానే మన మొబైల్స్‌ లో ప్రత్యక్షమవ్వడం జరుగుతోంది. ఇటువంటి వాటిని మనం కోరుకోకుందానే మన వాట్సాప్‌ గ్రూపుల్లోనో, ఇతర సోషల్‌ మీడియా సైట్లు ద్వారా మన మొబైల్స్‌ కు చేరుకుంటాయి.

ఇటువంటివి చూసి వెంటనే అనుకూలంగానో, ప్రతికూలంగానో ఒక నిర్ణయానికి రావొద్దు. విచక్షణతో ఆలోచించండి. మీకు తెలిసిన సీనియర్లతో సంప్రదించండి. ఆ ప్రచారం ఉద్దేశం ఏమిటో శోధించండి. అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం.

  • ఈ మైండ్‌ గేమ్‌ ను ముందుకు తీసుకెళ్లడానికి నిపుణులు, సుశిక్షితులైన టెక్కీలు పని చేస్తుంటారు. అందువల్ల మనం అప్రమత్తతగా లేకపోతే వీళ్ల బుట్టలో పడే ప్రమాదం ఉంది.
  • సోషల్‌ మీడియాలో ఒక పోస్టు కనిపించగానే దానిపై కామెంట్‌ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. మీరు చేసే కామెంట్‌ పార్టీకి నష్టం చేస్తుందా? లాభం చేస్తుందా ? అనే విషయాన్ని విచక్షణతో ఆలోచించండి.
  • ప్రత్యర్థులను నియంత్రించడానికి మనం పెట్టే పోస్టులు సరళంగా, ఆలోచింపజేసే విధంగా మాత్రమే ఉండాలి. ఎక్కడ హద్దులు మీరకూడదు.
  • మైండ్‌ గేమ్‌ లో మరో కోణం అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సదెన్‌ గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అ! ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
  • ప్రత్యర్థులు మన పార్టీని, నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా.. మనం తిరిగి అతడిని విమర్శించేటప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించండి. మనల్ని ఒకటి అన్నప్పుడు నాలుగు మాటలు అనడం సహజం. ఆ నాలుగు మాటల వల్ల ప్రజల్లో అతనికి సానుభూతి కలగకూడదు.
  • ప్రత్యర్థి దూషణలకు, విమర్శలకు తగినంత మోతాదులోనే స్పందించి సమాధానం చెప్పాలి. మోతాదు పాళ్లు మించకుండా చూసుకోండి. వాడే భాషలోగానీ, ఆరోపణలలోగానీ, సహీతుకత ఉండాలి. ఎదుటివారు కూడా వీళ్లు మాట్లాడుతుంది కరెక్టే అనే భావన కలగాలి.
  • ఎదుటి పార్టీ/నేతలు మనపై విమర్శలు చేసిన పోస్టులు వస్తే అవి సదరు పార్టీ/నేత చేశారో లేదో నిర్ధారించుకోండి. ఆ తరవాతే స్పందించండి. కొన్ని ఫేక్‌ పోస్టులు మైండ్‌ గేమ్‌ లో భాగంగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలి’. అంటూ మార్గదర్శకాలను ట్వీట్ చేశారు.