జగన్‌ను భస్మాసురుడితో పోల్చిన నాగబాబు

nagababu fire to jagan

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి జగన్ ఫై విమర్శలు చేసారు. జగన్‌ను భస్మాసురుడితో పోల్చి వార్తల్లో నిలిచారు. జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే నాగబాబు..తాజాగా ట్విట్టర్‌లో జగన్‌ టార్గెట్ చేసారు. మాములుగా సీఎం జగన్ కు తన దగ్గరకు వచ్చిన వాళ్లను తలపై చేయిపెట్టి ఆశీర్వదించడం అలవాటు. జనాల మధ్య ఉన్నప్పుడు ఇలా చాలా మంది తలలపై చేయిపెట్టి నవ్వుతారు. ఈ పాయింట్‌ను టార్గెట్ చేస్తూ, జగన్‌ను పరోక్షంగా భస్మాసురిడితో పోలుస్తూ నాగబాబు ట్వీట్ చేశారు.

‘భస్మాసురుడు శివుడి వరంతో ఎవరి తల మీద అయినా చెయ్యిపెడితే భస్మం అవ్వాలని కోరుకున్నాడు. కానీ తనకి వరం ఇచ్చిన శివుడి మీద ప్రయోగించాలని చూసాడు. విష్ణు మూర్తి ఉపాయంతో శివుడు బ్రతికాడు, భస్మాసురుడు చచ్చాడు. కానీ, శివుడికి మాత్రం భయం పోలేదు. భస్మాసురుడు మళ్ళీ పుడితే ఎక్కడ నెత్తి మీద చెయ్యి పెట్టి చంపుతాడో అని భయపడి కోట్లాది మనుషుల రూపంలో జన్మించాడు. ఒకడు భస్మం అయినా ఇంకో మనిషి రూపంలో బ్రతికి ఉండొచ్చు అని తెలివిగా ఆలోచించాడు. అందుకే ప్రజలే దేవుళ్ళు అని నానుడి వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భస్మాసురుడు మళ్ళీ పుట్టాడు. జనాలని భస్మం చెయ్యటానికి. అందుకే కనబడిన ఆడవారి మీద మగవారి మీద చేతులుంచి దేవుడి రూపాలైన జనాన్ని భస్మం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఓ విష్ణు దేవా ఈ జనాల్లో మళ్ళీ పుట్టిన శివుడిని కాపాడు’’ అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.