కొత్త డైరెక్టర్ తో నాగ్ ప్రయోగం..

కింగ్ నాగార్జున హిట్ కోసం కాళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు సోలో హిట్‌ లేదు. ‘ఓం నమో వేంకటేశాయ’, ‘ఆఫీసర్‌’, ‘మన్మధుడు-2’ , ‘వైల్డ్‌ డాగ్‌’ ఇలా అన్ని భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. అంతే ఎంతో కష్టపడి చేసిన ‘ది ఘోస్ట్‌’ సైతం ప్లాప్ అయ్యింది. ఈ క్రమంలో ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ క్రమంలో ‘సినిమా చూపిస్తా మామా’, ‘నేను లోకల్‌’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన ప్రసన్న కుమార్‌ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలల నుండి ఈ కాంబోలో సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో దాదాపు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించనున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.