పామాయిల్ సాగుకు నాబార్డ్ సహకారం అందించాలి
మంత్రి హరీశ్ రావు
Hyderabad: నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు – 2021ను అమీర్ పేటలోరి మ్యారీ గోల్డ్ హోటల్ లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు.
ఈ సదస్సులో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రైతు ఆదాయం పెంచడం నాబార్డు లక్ష్యం అని అన్నారు. తన సూచనలు పాటించినందుకు నాబార్డుకు కృతజ్ణతలు తెలిపారు. ఇప్పుకు కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందుతోందన్నారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకువచ్చామని హరీష్ చెప్పారు. ఫామ్ ఆయిల్ సాగుకు నాబార్డ్ సహకారం అందించాలన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీఎస్ .సోమేష్ కుమార్. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు. . టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నాబార్డ్ సీజీఏం రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/