జీ20 సమావేశాల్లో నాటు ..నాటు స్టెప్స్

నాటు…నాటు సాంగ్ మేనియా ఇంకా తగ్గడం లేదు. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావత్ ప్రేక్షకులను , అభిమానులను అలరించింది. అంతే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి హౌరా అనిపించింది. తాజాగా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం తో హాలీవుడ్ స్థాయిలో ఈ సాంగ్ మరింత పాపులర్ అయ్యింది. తాజాగా జీ20 సమావేశాల్లో కూడా ఈ సాంగ్ హావ కనపడింది.

ప్రస్తుతం భారత దేశం అధ్యక్షతన జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో ‘అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) ఆఫ్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్’ సమావేశం చండీగఢ్ లో జరిగింది. ఈ భేటీకి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు.. నాటు నాటు పాటకు కాలు కదిపారు. స్థానిక కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.