సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ
పెద్ద సంఖ్యలో ముస్లిం యువత, మహిళలు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది. ముస్లిం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలతో ఈ ర్యాలీకి తరలి వచ్చారు. ఈ నిరసనలో సుమారు 40 వేల మంది పాల్గొన్నట్లు అంచానా. భారీ ర్యాలీ అనంతరం బహింరగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ప్రసంగించనున్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టనున్నారు. కాగా భారీ ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కుట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/