పల్నాడులో టీడీపీ నేతపై హత్యాయత్నం

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం జ‌రిగింది. ఈ దాడితో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలవల గ్రామంలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఆయనపై గొడ్డళ్లతో దాడి చేశారు ప్రత్యర్థులు. ఈ ఘ‌ట‌న‌లో బాలకోటి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అత‌నిని నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేశారు కోటిరెడ్డి.

దాడికి పాల్పడింది రొంపిచర్ల వైస్సార్సీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు అని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా..చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. ఈ దాడి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.