కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ఇద్దరికి గాయాలు
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి మన్ఖుర్డ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం, రహదారిని క్లియర్ చేయడానికి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలోని దెబ్బతిన్న భాగాన్ని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెన కూలిపోయినప్పుడు కొన్ని వాహనాలు దాని కింద ఉన్నాయి, దీంతో అక్కడున్న ఒక ట్రక్కుతో పాటు మరో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కట్టర్తో వంతెన దెబ్బతిన్న భాగాన్ని తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకోసం క్రేన్లను సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. కాగా వంతెన నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/