‘ములుగు’ సిద్ధాంతి కన్నుమూత
నేడు మలక్ పేట్ లో అంత్యక్రియలు
Hyderabad: ప్రముఖ జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సిద్ధాంతి గుండె పోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు. .గుంటూరు ఆయన స్వస్థలం. హైదరాబాద్లో స్థిరపడ్డారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్పేట్ హిందూ స్మశాన వాటికలో రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/