విషమంగా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కొద్ది వారాల కిందట ములాయం సింగ్ అనారోగ్యం బారిన పడడంతో ఆయనను కుటుంసభ్యులు గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, ఆదివారం నాడు ములాయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్య నిపుణులు సుషీలా కటారియా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తుంది. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ మూడుసార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, యూపీయే ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా ములాయం ఎన్నికయ్యారు. అత్యధికంగా మెయిన్‌‌పురి నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.