పుట్టపర్తిలో ప్రత్యక్షమైన ఎంఎస్‌ ధోనీ

MS Dhoni
MS Dhoni

అనంతపురం: భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏపిలోని అనంతపురం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. సత్యసాయి మహా సమాధి దర్శనార్థం ధోని ఈరోజు ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అది అలా ఉంటే ధోనీ గత కొన్ని రోజులుగా క్రికెట్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. అయితే త‌ర్వ‌లో ప్రారంభమయ్యే ఐపిఎల్‌ మ్యాచ్‌ల్లో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు ధోనీ భవితవ్యంపై టీమిండియా కోచ్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ధోనీ పునరాగమనం ఐపిఎల్‌పై ఆధారపడి ఉందని కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. అయితే ఇప్పటికే ప్రాక్టీసు ప్రారంభించిన మిస్టర్‌ కూల్‌ ఐపిఎల్‌లో విజృభించి మళ్లీ టీమిండియాలో అడుగు పెట్టాలని క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/