మల్టీటాలెంటెడ్ మ్యాన్ ఎంఎస్ ధోనీ
పీయూష్ చావ్లా, ఆర్పి సింగ్లకు పానీపూరి అందించిన మహీ
మాల్దీవులు: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తనకు దొరికిన విశ్రాంతి సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసున్నాడు. ఈ మధ్యనే ధోనీ మాల్దీవులకు వెళ్లాడు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్పి సింగ్, పీయూష్ చావ్లాలు కూడా ఓ కార్యక్రమంలో ధోనీకి తారసపడ్డారు. అక్కడే మహీ తనలోని పాకశాస్త్ర నిపుణుడిని నిద్రలేపాడు. ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన మహీ.. అక్కడున్న అన్ని పాదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసాడు. వాటిని సహచర క్రికెటర్లు ఆర్పీ సింగ్, పీయూష్ చావ్లాలకు అందించాడు. వెంటనే ఆర్పీ సింగ్ ధోనీకి కృతజ్ఞతలు తెలిపాడు. ధోనీ పానీపూరి తయారు చేసిన విధానాన్ని ‘ఎంఎస్ ధోనీ ఫాన్స్ ఆఫిషల్’ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ‘మాల్దీవుల్లో మా రాక్స్టార్ పానీ పూరిస్ తయారుచేస్తున్నాడు’ అని కాప్షన్ రాసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. అభిమానులు ఫన్నీ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘మల్టీటాలెంటెడ్ మ్యాన్ మహీ’ అని ఒక అభిమాని వీడియోకు ట్వీట్ చేశాడు. ‘ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టమైనవి మహీ మరియు పానీపూరి’ అని ఓ అభిమాని కామెంట్ చేసాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/