సినీ రంగంలోకి అడుగుపెట్టిన MS ధోని

MS Dhoni
MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోనీ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తొలుత తమిళ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాస్ట్, క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తర్వాత-తెలుగు, మలయాళం లో వరుసగా ఎంఎస్ ధోని సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు.

ఇక దోనో మొదటి సినిమా..ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని, అంతేకాదు ఈ సినిమా కథను సాక్షినే రాశారు. దీనిపై తమిళ్ మణి మాట్లాడుతూ… సాక్షి రచించిన కథను తాను చదివిన క్షణంలో అద్భుతమైన అనుభూతికి గురయ్యానని చెప్పారు. కథ చాలా కొత్తగా ఉందని… ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రజలను ఆకట్టుకునే సత్తా ఈ కథకు ఉందని అన్నారు.