టీడీపీ కి కొత్త పేరు పెట్టిన విజయసాయి రెడ్డి

టీడీపీ పార్టీ ఫై సోషల్ మీడియా లో నిత్యం విమర్శలు , సెటైర్లు చేసే వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..తాజాగా టీడీపీ పార్టీ కి కొత్త పేరు పెట్టారు. టీడీపీ అంటే ‘తెలుగు దున్నపోతుల పార్టీ’ అని కొత్త అర్ధం చెప్పారు. పార్టీకి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారని.. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీల తో తీట్టిస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందటి ట్వీట్ లో కూడా ఇలాగే విమర్శలు చేశారు.టీడీపి వెధవలకు పశువులకు ఇచ్చే ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలని సంచలన ట్వీట్‌ చేశారు. రేప్‌ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్‌ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలని పేర్కొన్నారు.

మా పార్టీలో ప్రజల్లో తిరిగితే మంచి నాయకులవుతారు.. టీడీపీలో మాత్రం జనంలో మొరిగితేనే నాయకులవుతారు అంటూ మండిపడ్డారు సాయిరెడ్డి.. ఎన్టీఆర్‌ రోజుల్లో టీడీపీ వారు మా పార్టీని చూడండి అంటే… ఇప్పుడు చంద్రం తాతయ్య రోజుల్లో టీడీపీ నాయకులు మాది చూడండి అంటున్నారు! థూ… వీళ్ల బతుకు చెడ.. అంటూ విమర్శలు గుప్పించారు. పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తాం.. అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారు అంటూ ఘాటు కామెంట్లు చేసారు. మరి విజయ సాయి ట్వీట్స్ కు టీడీపీ నేతలు ఎలా కౌంటర్లు ఇస్తారో చూడాలి.