సిఎం కెసిఆర్‌కి కెటిఆర్‌ తోనే ముప్పు

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్, కర్మన్ ఘాట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టిఆర్‌ఎస్‌ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కెసిఆర్‌ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కెటిఆర్‌ నుంచి ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, కెసిఆర్‌ ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టిఆర్‌ఎస్‌ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని అన్నారు. కెసిఆర్‌ ఇంట్లోనే కెటిఆర్‌ ఉంటున్నారని, ఆయన్ను ఆ ఇంటి నుంచి పంపించి వేయాలని అన్నారు. సిఎం పదవి కెసిఆర్‌ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. కెటిఆర్‌ సిఎం పదవిని ఆశిస్తున్నారని, వెంటనే ఆయనకు పదవిని ఇవ్వకుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కెటిఆర్‌ ను ప్రగతి భవన్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్‌ కు భద్రతను మరింత పెంచాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/