పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ
న్యూఢిల్లీ : ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్లమెంట్ సభ్యులందరికీ లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి తనపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసి సీబీ.. సీఐడీ అధికారులతో కస్టోడియల్ టార్చర్ చేశారన్నారు. తాజాగా మరోసారి తన నివాసం వద్ద పోలీసులు రెక్కీ నిర్వహించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/