బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు
విచారణ మధ్యాహ్నం కు వాయిదా
New Delhi: నరసాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ చదివి వినిపించారు.
రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యిందని . మెడికల్ బోర్డు నివేదికకు, ఆర్మీ ఆస్పత్రి చెకప్కు మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా , కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్లో తేలిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా..? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరగా, తక్షణమే విచారణ పూర్తి చేయాలని రోహత్గీ కోర్టును కోరారు. ఇలా రెండు వైపులా వాదనలు పూర్తయ్యాయి.
అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/