సిఎంకు లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు
అమరావతి: ఏపి సిఎం జగన్కు ఎంపి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తు.. ఈమేరకు సిఎంకు లేఖ రాశారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారని జగన్కు ఎంపి గుర్తుచేశారు. అధికారికంగా ప్రకటన చేస్తే ప్రజలు ఎంతో సంతోషపడతారని లేఖలో పేర్కొన్నారు. సిఎం జగన్కు ఎంపి రఘురామకృష్ణంరాజు రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపి క్యారాలయం ఈరోజు మీడియాకు విడుదల చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/