ప్రియుడితో సుఖం కోసం..కన్న బిడ్డలను చంపేసిన తల్లి

కన్న బిడ్డలను ఏ తల్లి కూడా చంపాలనుకోదు..కానీ ఈ కసాయి తల్లి మాత్రం తన పడక సుఖం కోసం కన్న బిడ్డలను చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..13 ఏళ్ల క్రితం భర్త చనిపోవడం తో పూరేటి లక్ష్మీ అనూష అనే మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తూ చేస్తూ తన ఇద్దరు పిల్లలు కుమార్తె చిన్మయి (8) , కుమారుడు మోహిత్ (6) లను పోషిస్తుంది. ఈ క్రమంలో ఈమె.. ఓ వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి.. తన బిడ్డలను తరచూ కొట్టడం మొదలుపెట్టింది. ఇక ఇటీవల పిల్లల్ని కొట్టద్దని అడ్డు వచ్చిన.. తల్లి ముత్యం కనకదుర్గను కూడా గాయపరిచింది అనూష. ఇక తన పాదసుఖానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని..ఎలాగైనా వారిని చంపేయాలని అనుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపింది. పిల్లలకు ఉరి వేసిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తల్లిని అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.