నిజాంపేట్ లో పిల్లలతో తల్లి అదృశ్యం
Hyderabad: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లోని నిజాంపేట్ లో చోటుచేసుకుంది. రేఖ అనే మహిళ ఈనెల 14న మధ్యాహ్నం 12:30 గంటలకు తన ఇద్దరు పిల్లలు దర్శిని (8 సంలు), డేవిడ్ కిషన్ (3 సంలు) తీసుకొని ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లి ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేదు. రేఖ భర్త భూపతి విజ్ఞేష్, కుటుంబ సభ్యులు రేఖ, పిల్లల కోసం చుట్టుపక్కల అంతటా వెతికినా.. బంధువులను, స్నేహితులను అడిగినా కూడా ఆచూకీ లభించలేదు. భూపతి విజ్ఞేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/