ప్రారంభమైన ప్రణబ్‌ ముర్జీ అంతిమ యాత్ర

Mortal remains of Pranab Mukherjee being taken from his reside

న్యూఢిల్లీ: భార‌త‌ మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్ర‌ణ‌బ్ నివాసం నుంచి లోధి శ్మ‌శాన వాటిక‌కు అశ్రు న‌య‌నాల మ‌ధ్య అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. గ‌న్ క్యారేజ్ పై కాకుండా సాధార‌ణ అంబులెన్స్‌లో అంతిమ‌యాత్ర కొన‌సాగుతుంది. ప్ర‌ణ‌బ్‌కు వీడ్కోలు ప‌లికేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, కాంగ్రెస్ నాయ‌కులు త‌ర‌లివ‌స్తున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు లోధి శ్మ‌శాన‌వాటిక‌లో ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/