ఆమ్‌ ఆద్మీ పార్టీలో భారీ ఎత్తున చేరికలు

24 గంటల్లో ఆప్ లో చేరిన 11 లక్షల మంది

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తోంది. మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు. ఈ విషయాన్ని ఆప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాము ఘన విజయం సాధించిన 24 గంటల్లోనే మరో ఘనతను సాధించామని ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/