భారత్లో మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు
1,637 కరోనా కేసులు… 38 మరణాలు
దిల్లీ: దేశంలో మర్కజ్ ఘటన వెలుగు చూశాక కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కేవలం గడిచిన 12 గంటలలో 240 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు దేశంలో 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 38 మంది మరణించారని, తెలిపింది. ప్రస్తుతం 1,466 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. కాగా మహరాష్ట్రలో కోవిడ్ 19 తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 320 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/