ఏపిలో మరిన్ని కరోనా పాజిటివ్‌ కేసులు

కొత్తగా మరో 16 కేసులు

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవల 12 గంటల వ్యవధిలో 16 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 180 కి చేరింది. కాగా కొత్తగా నమోదయిన కేసులలో ఎక్కువగా జమాత్‌కు వెళ్లి వచ్చిన వారె ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా జమాత్‌కు వెళ్లి వస్తే వారందరూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదు కాగా, క్రిష్ణా జిల్లాలో 27 కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/