కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్కు ఓ కొరత
వ్యాక్సిన్ ట్రయల్స్కు దొరకని కొతులు..దొరికిన ఖరీదు విపరీతం
చైనా: కరోనా మహమ్మారికి టీకా కొనుగొనేందుకు చైనాలోనూ జోరుగా పరీక్షలు జరుగుతున్నాయి. అయితే చైనా పరిశోధనశాలలకు ఇప్పుడు ఓ కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ పరీక్షలు చేపట్టేందుకు కోతులు దొరకడం లేదట. ఒకవేళ దొరికినా.. వాటి ఖరీదు విపరీతంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ను మనుషుల మీద ప్రయోగం చేయడానికి పూర్వం.. కోతులపై పరీక్ష చేయనున్నారు. చైనాలో చాలా వరకు ఫార్మాకంపెనీలు … కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఎలుకలు, కుందేళ్లపై ఇప్పటికే కొన్ని ల్యాబ్ల్లో పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ను కోతులపై పరీక్షించాల్సిన సమయం వచ్చింది. యిషెంగ్ అనేక ఫార్మా కంపెనీ భారీ స్థాయిలో వ్యాక్సిన్ పరీక్షలు మొదలుపెట్టింది. సెప్టెంబర్లోగా వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్ట్ లేకుండా పరిశోధకులు పనిచేస్తున్నట్లు ఫార్మా కంపెనీ పరిశోధకుడు జాంగ్ తెలిపారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/