ఇరాన్ ప్రముఖ అణు శాస్త్రవేత్త దారుణ హత్య
శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం..ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ట్రెహాన్కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే దారుణ హత్యకు గురయ్యారు. నగర శివారు ప్రాంతమైన అబ్సార్డ్ వద్ద వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అణుశాస్త్రవేత్త హాస్పిటల్లో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. అణు శాస్త్రవేత్త హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్తలను వరుసగా గత పదేళ్ల నుంచి హతమారుస్తున్నట్లు ఇజ్రాయిల్పై ఆరోపణలు ఉన్నాయి.
సీనియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్లో కోవర్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్లో ఫక్రిజాదేకు ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాము చేపడుతున్న అణు కార్యక్రమం శాంతి కోసమే అంటూ ఇరాన్ ప్రకటించింది. అణు శాస్త్రవేత్త ఫక్రిజాదే హత్యపై ఇంత వరకు ఇజ్రాయిల్ స్పందించలేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/