మోహన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు ..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి రంగ స్వామి నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రంగ స్వామి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు. ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన అంత్య క్రియలు గురువారం తిరుపతిలో జరుగనున్నాయి.