Auto Draft

‘మన్‌ కీ బాత్‌’ లో ప్రధాని మోడీ పిలుపు

Modi's call in 'Mann Ki Baat'
Modi’s call in ‘Mann Ki Baat’

New Delhi: ధైర్యవంతమైన , భద్రతా దళాలతో భారతదేశం దృఢంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్తగా కరోనా మహమ్మారి మధ్య పండుగలను జరుపుకుంటుండగా.. సైనికులకు ఒక దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.

సరిహద్దుల్లో కాపలా కాస్తూ బయటి నుంచి వచ్చే ముప్పు నుంచి దేశం సురక్షితంగా ఉండేందుకు సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారన్నారు.

ఈద్‌, దీపావళి వంటి అనేక పండుగలు ఈ ఏడాదిలో జరుగాయని, ఆయా సమయాల్లో సరిహద్దులో నిలబడిన మన ధైర్య సాహసాలు గల సైనికులను కూడా స్మరించాలన్నారు.

ఈ ధైర్యవంతులైన కొడుకులు, కూతుళ్ల గౌరవార్థం మనం ఇంట్లో దీపం వెలిగించాలని మోదీ అన్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/