రాష్ట్రాల సిఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్?
ఈ నెల 11 నిర్వహించునున్నట్లు సమాచారం!
దిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ కొనసాగించాలని పలు రాష్ట్రాలనుండి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మోదీ మేధావుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా ఇప్పటి వరకు లాక్డౌన్ను పొడగించాలని అన్ని రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సమావేశం ఈ నెల 11న ఉండనున్నట్లు, లాక్డౌన్ పొడగింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/