ఈ నెల 26న హైదరాబాద్కు ప్రధాని మోడీ రాక…
భారత ప్రధాని మోడీ ఈ నెల 26 న హైదరాబాద్ కు రాబోతున్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవంలో మోదీ పాల్గొననున్నారు. అంతేకాకుండా రామగుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జాతీయ పార్టీల నేతలంతా ప్రస్తుతం తెలంగాణ ఫై ఫోకస్ పెట్టారు. మొన్నటికి మొన్న జేపీ నడ్డా, రాహుల్ గాంధీ ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. ఇక ఇప్పుడు.. ప్రధాని మోడీ హైదరాబాద్లో పర్యటించనున్నారు.
20 రోజులు వ్యవధిలో బీజేపీ ప్రముఖులు, అగ్రనేతలు తెలంగాణకు రావడంతో రాష్ట్ర కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అనంతరం బండి సంజయ్కు మోడీ ఫోన్ చేసి ప్రశంసించిన సంగతి తెలిసిందే.