దేశ ప్రజలకు ఏడు సూత్రాలు
తప్పక పాటించాలని ప్రధాని వినతి
దిల్లీ: జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ ప్రజలు తప్పకపాటించవలసిన ఏడు సూత్రాలతో ఓ సప్తపదిని ప్రకటించారు. ఈ 19 రోజులు వాటిని అమలు చేయాలని సూచించారు. అవి..
- వయసు పైబడిన పెద్దవారిని కోవిడ్నుండి కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
- డాక్టర్లు, పోలీసులకు, పారిశుద్య కార్యికులకు గౌరవం ఇవ్వాలి.
- ఆకలితో ఉన్న వారికి ఆహరాన్ని అందించేందుకు వీలైనంత సాయం చేయాలి.
- ప్రైవేటు ఉద్యోగులను తొలగించే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు.
- రోగనిరోధక శక్తిని పెంచుకునేలా పోషకాహరాన్ని తీసుకోవాలి.
- ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని, కరోనా పై ప్రతిక్షణం సమాచారం తెలుకోవాలి.
- ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి. ఒకరితో ఒకరు దగ్గరగా మెసలవద్దు.
ఈ సూత్రాలను పాటించడం ద్వారా దేశం నుండి కరోనాను తరిమికొట్టవచ్చు అని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరు వీటిని విధిగా పాటించాలని సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/