బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాన మోడీ ఫోన్ చేశారు. ఇటీవల బండి సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్ష చేస్తున్న క్రమంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈవిషయంపై బండి సంజయ్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై మోదీ ఆరా తీసినట్లు తెలుస్తుంది. అలాగే 317 జీవో గురించి ప్రధాని, బండి సంజయ్ ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దాదాపు 15 నిముషాలు బండి సంజయ్ తో మోడీ మాట్లాడడం జరిగింది.

ఇటీవల ఉపాధ్యాయుల బదిలీ, 317 జీవోలో మార్పులు చేయాలని బీజేపీ..తెరాస సర్కార్ ఫై పోరాటానికి దిగింది. తెరాస తీసుకొచ్చిన ఈ జీవో కు నిరసనగా సంజయ్ జాగరణ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కోవిడ్ ఉల్లంఘనల పేరుతో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం… జైలుకు తరలించడం తెలిసిందే. హైకోర్ట్ ఉత్తర్వులతో మళ్లీ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ అంశం రాజకీయంగా బీజేపీలో మంచి బూస్ట్ తెచ్చింది. స్టేట్ లీడర్లతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు బండి సంజయ్ ని పరామర్శించారు.