తెలంగాణపై మోడీ మరోసారి అక్కసు వెళ్లగక్కారు: హరీశ్ రావు

తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి..మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: ఏపీ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణపై మోడీ మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరవీరుల త్యాగాలను కించపరిచారని విమర్శించారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని మోడీ కుట్ర చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్దిపథంలో దూసుకుపోతూనే ఉంటుందని అన్నారు. వలస కార్మికుల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని మోడీ అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు, ట్రంప్ సభలను నిర్వహించినప్పుడు కరోనా పెరగలేదా? అని ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/