మోడి మరోసారి ప్రధాని కావడం ఖాయం

లక్నో: ఈదేశ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని బిజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 74 సీట్లు గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా మొత్తం 80 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ 72 సీట్ల పైచిలుకు గెలుస్తుందనడంలో సందేహమే లేదన్నారు. మోడిని మరోసారి ప్రధానిని చేయాలని ఈ దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా తెలిపారు. అందుకు అనుకూలంగానే బిజెపికి ఫలితాలు వస్తాయన్నారు.యూపీఏ హయాంలో దేశంలో నక్సలిజం అధికంగా ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అయ్యారో.. అప్పట్నుంచి నక్సలిజాన్ని అంతమొందించామని అమిత్ షా అన్నారు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/