ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా..

modi hyderabad tour cancelled

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి సందర్బంగా వందే భారత్ రైలు ప్రారంబోత్సవానికి హాజరు కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఈ నెల 13 న మోడీ తెలంగాణ కు రావాల్సి ఉండగా..ఇది కూడా వాయిదా పడింది. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మోడీ పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉంది కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది.

మోడీ పర్యటన వాయిదా పడినప్పటికీ అమిత్ షా, నడ్డా పర్యటన లు మాత్రం ఖరారయ్యాయి. ఈ నెల 11న అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లేదా మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంంగానే ఒక శక్తి కేంద్రంతో అమిత్ షా సమావేశమవుతారు. అలాగే ఈ నెల చివర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ లో పర్యటించబోతున్నారు.