కేంద్ర క్యాబినెట్‌ అత్యవసర సమావేశం!

ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్న క్యాబినెట్

PM Modi At Union Cabinet Meeting
PM Modi At Union Cabinet Meeting

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో స్టాక్‌ మార్కెట్‌ పతనం, దేశంలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ఇతర దేశాలకు విమానాల రద్దుతో ఏర్పడిన ప్రతిష్ఠంభనలపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ రావాలని పీఎంఓ నుంచి వర్తమానాలు వెళ్లాయి. ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని మోడి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగనుండగా, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. కరోనా వ్యాధి అనుమానితులు తిరుగాడిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోడి మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/