15 నెల‌ల త‌ర్వాత పట్టాలెక్కిన ఎంఎంటీఎస్​ రైళ్లు

ప్ర‌స్తుతం 10 రైళ్ల సేవలు ప్రారంభం

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెల‌ల త‌ర్వాత ప్రారంభ‌మ‌య్యాయి. ప్రస్తుతం 10 రైళ్ల సేవలు ప్రారంభ‌మ‌య్యాయ‌య‌ని దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఈ రైళ్లు ప్ర‌తి రోజు ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, విద్యార్థుల పాస్‌లు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల‌లో క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. . ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. కాగా, గ‌త ఏడాది మార్చి 23 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచాయి.

2003 ఆగస్టు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర సేవ‌లు అందిస్తున్నాయి. 2014లో 15 కిలోమీటర్ల మేర‌ సికింద్రాబాద్-ఫలక్నుమా మ‌ధ్య సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్ల సేవ‌లు అందుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/