కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కవిత అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్బంగా కొండగట్టు ఆలయ పునర్నిర్మాణంపై ఆలయ అధికారులను కవిత ఆరా తీశారు. ఆలయ పునర్నిర్మాణం గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. కేసీఆర్ పాలనలో ఆలయాల అభివృద్ధి జరుగుతోందని , కొండగట్టు కోవెల కూడా మరో యాదాద్రిలా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొండగట్టు నుంచి కవిత నిజామాబాద్ జిల్లాకు బయల్దేరారు. నందిపేట్​ మండలంలోని చౌడమ్మ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కవిత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు కవితను ప్రశ్నించడం జరిగింది. ఎల్లుండి మరోసారి కవితను ప్రశించానున్నారు. మొదటి రోజు దాదాపు 09 గంటల పాటు విచారించడం జరిగింది.