ఢిల్లీ బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేయనున్న ఎమ్మెల్సీ కవిత

పర్వేష్ వర్మ, మంజిందర్ సిర్సాలపై పరువునష్టం దావా వేయనున్న కవిత

MLC Kavitha to file defamation suit against BJP leaders

హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ తో కెసిఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ బిజెపి చేస్తున్న ఆరోపణల ఫై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కవిత బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలపై పరువు నష్టం దావా వేయనున్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

ఈ ఆరోపణలపై ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిజెపిపై మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని… ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కెసిఆర్ కూతురుని కాబట్టే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా కెసిఆర్ భయపడరని అన్నారు. తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/