రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతు మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ః రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ధర్నాలో రైతన్నలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. బిజెపి ప్రభుత్వం పోరాటాలతోనే తలొగ్గుతదని..అందుకే రేపటి ధర్నాతో మన సత్తా ఏంటో చూపిద్దామన్నారు. కార్పోరెట్లు దోచుకుని దేశం దాటిపోతున్నారని ఆరోపించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే వాళ్లందరినీ వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పాలు పెరుగుపై పన్ను విధించడమేనా? బిజెపి పాలన అని ప్రశ్నించారు. నరేగాను వ్యవసాయానికి అనుభందం చేయాలని డిమాండ్ చేశారు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలన్నారు. కేంద్రం కార్పోరెట్లకు వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/