మానవత్వం చాటుకున్న కవిత

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సపర్యలు

mlc kavita expresses humanity
mlc kavita expresses humanity

Nizamabad: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మ‌రోసారి మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ ‌కవిత వెళ్తుండగా మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు.

గాయాలతో పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. 

 వెంటనే ఆ మ‌హిళ‌ను స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల సహాయంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యసేవలు అందేలాచూడాలని ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/