సిఎం జగన్‌పై బురద చల్లాలని చూస్తున్నారు

mla roja
mla roja

తిరుపతి: ఎమ్మెల్యే రోజా ఈరోజు స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్‌లను రోజా విరాళంగా ఇచ్చారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ స్ట్రెచర్‌లను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సిఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కులాన్ని, మతాన్ని జగన్‌కు ఆపాదించటం తగదని విమర్శలకు ఆమె హితవు పలికారు. బిజెపి జనసేన ముసుగులో టిడిపి అధినేత చంద్రబాబు.. సిఎం జగన్‌పై బురద చల్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అంతర్వేది అంశంలో జగన్ సీబీఐ విచారణకు అంగీకరించారన్న విషయాన్ని రోజా మరోసారి గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన ఆమె.. రెండు చోట్ల ఓడిపోయిన ఆయనకు అంతర్వేది విషయంలో మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/