జగన్ ఫై మరోసారి తన స్వామిభక్తి ని చాటుకున్న ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి జగన్ ఫై తన స్వామిభక్తి ని చాటుకుంది. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం ఎస్వీ కోయిల్ వీధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలతో పవర్ లూమింగ్ మిషన్ల యూనిట్ ను రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మగ్గంపై కూర్చుని చీర నేశారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రాలతో కూడాన చిత్రాలతో చీర నేసి తన స్వామిభక్తి నిరూపించుకున్నారు.

అనంతరం చీరను ప్రదర్శించారు. వస్ర్త రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని నేతన్నలు ఎదగాలని ఆశిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నేతన్నలు తమదైన రంగంలో అభివృద్ధి సాధించాలని రోజా కోరారు. వస్రాల్లో నూతన పద్ధతులు పాటించి నేతన్నలు ముందుకు కదలాలని సూచించారు.