అధికారులపై రోజా చిందులు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మరోసారి వైకాపాలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయారు ఎంపీటీసీలు. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నిస్తుండగా… రోజా ప్రత్యర్థి వర్గం అయిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి ఎంపీపీ పదవి కోసం డిమాండ్ చేసారు.

ఈ క్రమంలో అధికారుల పట్ల ఎమ్మెల్యే రోజా దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అధికారులను బెదిరించారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు ఎమ్యెల్యే రోజా. అంతే కాదు తన ప్రత్యర్థి వర్గం మొత్తం టిడిపి కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు.