చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం

కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలుపొందారు.. రోజా

అమరావతి: సిఎం జగన్‌పై నోరు పారేసుకున్న టిడిపి అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా విమర్శంచారు. వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబును తిరస్కరించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం ఎదురైందని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా… వాటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయని… వాటిలో 74 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు.

1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని రోజా గుర్తుచేశారు. మూడు దశాబ్దాలకు పైగా టిడిపి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న చోట… ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి జెండా ఎగిరిందని చెప్పారు. మనవడితో ఆడుకోవడానికి చంద్రబాబును కుప్పం ప్రజలు ఇంటికి పంపించేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఏం పీకాడని అన్న చంద్రబాబు ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/